
జపాన్ ను ప్రపంచంలో అత్యధికంగా వెండింగ్ మెషీన్లను వాడే దేశంగా చెప్పుకోవచ్చు. అక్కడ ప్రతీ 23 మందికి ఒక వెండింగ్ మెషీన్ ఉన్నట్టు ఒక అంచనా. ఈ మెషీన్లను సాఫ్ట్ డ్రింక్స్, గ్రీన్ టీ, ఐస్ క్రీం, న్యూస్ పేపర్స్, మేగజైన్స్,సిగరెట్స్,బీర్లు మొదలైనవాటిని అమ్మటానికి వాడుతారక్కడ. ఫుట్ పాత్ ల పై ఎక్కడ పడితే అక్కడ ఇవి వరుసగా కనిపిస్తాయక్కడ. అక్కడ దొంగలు వీటి జోలికి రారు అందుకే అక్కడ అవంతగా సక్సెస్ఫుల్ అయ్యాయి. కాయిన్లే కాదు నోట్లను కూడా ఇవి స్వీకరించి కరెక్ట్ చిల్లర తిరిగి ఇస్తాయి. హోటళ్ళ లొ ప్రతీ ఫ్లోర్లో వీటిని ఏర్పాటు చేస్తారు అక్కడ. రూం సర్వీస్ వాళ్ళని డిస్టర్బ్ చేయక్కర లేదు. మనంతట మనం కావల్సినప్పుడల్లా కావల్సిన డ్రింక్ ఈ మషీన్ల నుంచి తీసుకోవచ్చు. పక్కనున్న ఫోటో మీరు గమనిస్తే, 500 మి.లీ సాఫ్ట్ డ్రింక్ బాటిల్ ఖరీదు 120 యెన్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో 60 రూ.లూ. దాదాపుగా మన రేట్ల కంటే రెండు రెట్లు.
No comments:
Post a Comment